కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ వార్నింగ్

0
37

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు. ఇప్పుడు మర్యాదగా చెప్తున్న ఇంకోసారి చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది.రాష్ట్రం నుండి ఒక్కగానొక్క వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నావ్. మంచిగా ఉండు. మోడీ సర్కార్ లో 33 మంది బ్యాంక్ లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత. ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులే. గుజరాతిలే. బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ద కంట్రీ నినాదం ఇప్పుడు అవసరం. దమ్ము ఉంటే నన్ను జైల్లో పెట్టు బండి సంజయ్. నన్ను కాదు మిమ్మల్ని జైల్లో వేస్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సదువొస్తదో రాదో నాకు తెల్వదు .. ఆయనతో మాట్లాడించి వాళ్ల ఇజ్జత్ తీసుకునే బదులు ఇంగొకరితో మాట్లాడించడం బెటర్ అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.