సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ రెండు పార్టీలు మౌనం…

సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ రెండు పార్టీలు మౌనం...

0
59

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు… ఇక ప్రతీ దానికి ఎడ్డెం అంటే తెడ్డెం అనే కాంమ్రెడ్స్ కూడా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు వారికి పనిలేకుండా పోయింది. కొంత కాలంగా ఇళ్లకే పరిమితం అయ్యారు…

అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడులేని విధంగా పరిపాలన సాగిస్తున్నారు… సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారు.. అమ్మఒడి, రైతు భరోసా, పేదలకు ఇళ్ల పంపిణీ, స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో అక్కడి ప్రజలకు 70 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారు…

దీంతో కాంమ్రెడులు మౌనం పాటిస్తున్నారు… ఇక తాజాగా విశాఖ లో జరిగిన గ్యాస్ లీక్ సీఎం జగన్ స్పందించిన తీరుకు కాంమ్రెడ్లు సైతం ఫిదా అయ్యారు.. ఇంతకన్నా ఏ సీఎం అయినా ఏం చేస్తారని అంటున్నారు… ఇప్పటివరకు ఏరాష్ట్రం ఇవ్వని పరిహారం… నిజానికి లోపాలు వెతకడంలో కాంమ్రెడ్ పార్టీలకు మించిన పార్టీలు లేవు ఇప్పుడు వారు సైలెంట్ గా ఉన్నారంటే రాష్ట్రంలో జగన్ పరిపాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు…