తెలంగాణ స్పీకర్‌కు కరోనా..ఆస్పత్రిలో చేరిక

Corona admitted to Telangana Speaker

0
37

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలబ్రీటీలు ఇలా అందరికీ ఈ కరోనా మహమ్మారి సోకింది. ఇక తాజాగా తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ కు కరోనా సోకడం ఇది రెండవ సారి. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌ చేయించగా ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు