కరోనా బాధితుల కోసం తెలంగాణలో ప్రత్యేక హస్పిటల్ ఎక్కడో తెలుసా

కరోనా బాధితుల కోసం తెలంగాణలో ప్రత్యేక హస్పిటల్ ఎక్కడో తెలుసా

0
33

చైనా నుంచి కరోనా వైరస్ దేశానికి వచ్చింది, అక్కడ నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు ఇప్పటికే తెలంగాణలో 500 మంది కరోనా అనుమానితులు ఉన్నారు.

అయితే చైనాలో ఇటీవల వారంలో వెయ్యి పడకల ఆస్పత్రి వేగంగా నిర్మించారు, అలాగే తెలంగాణలో చిన్న తరహా ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారట, అయితే ఇప్పటికే వైరస్ వ్యాప్తి చెందుతోంది అని వార్తలు వస్తున్న సమయంలో ఈ కరోనాని ఎదుర్కొనేందుకు వైద్య అధికారులు సిబ్బంది రెడీ అయ్యారు.

కరోనా బాధితుల కోసం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి వద్ద ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేసింది. అయితే త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయనున్నారు అంటున్నారు, అయితే ఇలా ప్రత్యేక ఆస్పత్రి ఉంటే వారికి అక్కడ చికిత్స అందిస్తే, ఎవరికి కొత్తగా వైరస్ సోకదు అని చెబుతున్నారు వైద్యులు.