కరోనా కంప్లీట్ అయిన తర్వాత వైసీపీలోకి కీలక నేత

కరోనా కంప్లీట్ అయిన తర్వాత వైసీపీలోకి కీలక నేత

0
37

ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి… ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో అంత ఈజీగా పార్టీ గురించి అంచనా వేయలేక పోతున్నారు ఆ పార్టీ నేతలు… ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఉదయం నుంచి మధ్యహ్నం వరకు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలు సాయంత్రం అయ్యేలోపు వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

దీంతో పార్టీలో ఉండేది ఎవరో ఊడేది ఎవరో అర్థం కాని పరిస్థితని అంటున్నారు… కరోనా వైమహమ్మారి మన దేశానికి రాకముందు చాలామంది టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.. ఇక ఇదే క్రమంలో కరోనా మహమ్మారి పూర్తి అయిన తర్వాత గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని చూస్తున్నారట…

వరుస విజయాలతో దూసుకువెళ్లినకు ఈ సారి బ్రేకులు పడ్డాయి… దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట… తాజా సమాచారం ప్రకారం అనుచరుల కోరిక మేరకు వైసీపీలో చేరాలని చూస్తున్నారట…