కరోనాతో మృతి చెందిన తండ్రి అత్యక్రియలకు వెళ్లని కుమారుడు…. కన్నీరు తెప్పిస్తున్న సంఘటన…

కరోనాతో మృతి చెందిన తండ్రి అత్యక్రియలకు వెళ్లని కుమారుడు.... కన్నీరు తెప్పిస్తున్న సంఘటన...

0
36

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.. కొన్ని చోట్ల చేటు కాలం దాపరించింది… కరోనా సోకి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అయిన వారు భయపడేంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. తాజాగా కరోనాతో చనిపోయిన తండ్రికి అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకు నిరాకరించారు…

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది… ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కోవిడ్ 19తో ఇటీవలే మరణించారు… హిందు సంప్రదాయం ప్రకారం అతడి అత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు…

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు నిరాకరించారు… కరోనా వైరస్ సోకుతుందనే భయంతో కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు… తల్లి కూడా కుమారుడికి సహకరించింది… ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…