Flash: తెలంగాణ స్పీకర్ పోచారంకు మరోసారి కరోనా

0
32
RT-PCR mandatory

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీనితో కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షల్లో పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మధ్య తనను కలిసిన వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని పోచారం సూచించారు.