బీజేపీలో చేరనున్న క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్?..అక్కడి నుండే పోటీ..

Cricketer VVS Laxman to join BJP? .. Competition from there.

0
46

భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీలోకి ఆయన చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు చెపుతున్నారు. మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రజాబలం ఉన్న నేతలతో పాటు ప్రముఖులు, క్రీడాకారులపైనా కన్నేసింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ను బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు అమిత్‌ షా సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 12, 2012లో లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.