ఢిల్లీ లిక్కర్ స్కామ్‎..స్పందించిన ఎమ్మెల్సీ కవిత..ఏమన్నారంటే?

0
41

దిల్లీ లిక్కర్ స్కామ్​లో తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గేది లేదు.

కేసీఆర్‌ను మానసికంగా వేధించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం… ఎవరికీ భయపడేది లేదు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే భాజపా కుట్ర. కేసీఆర్‌ కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్‌ తగ్గుతారనుకుంటున్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఏ దర్యాప్తునకైనా సిద్ధమే.. మాది పోరాటం చేసిన కుటుంబం’ అని ఆమె అన్నారు. భాజపా నేతలు విపక్షాలపై బట్టకాల్చి మీదేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలపై దుమ్మెత్తిపోసి తుడుచుకోమంటున్నారని మండిపడ్డారు.