తెలంగాణ: హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ ను ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమలాపూర్లోని 262 బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది. మాకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు. ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోందని అన్నారు.
చివరికు ధర్మమే గెలుస్తుంది: బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్
Dharma will win in the end: BJP candidate Ethela Rajender