దోస్త్​ నోటిఫికేషన్ రిలీజ్..పూర్తి వివరాలివే..

0
72

తెలంగాణలో దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు.

జులై 1 నుంచి 30 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

జులై 6 నుంచి 30వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం

సెప్టెంబరు 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం