ఈసీ కీలక నిర్ణయం..ఆ రాష్ట్రంలో ఎన్నిక‌ల షెడ్యూల్ మార్పు

Easy key decision..Change of election schedule in that state

0
26

కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే పంజాబ్ రాష్ట్ర ఎన్నిక‌ల షెడ్యూల్ ను మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మ‌రో రాష్ట్రంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ను మార్చింది. మణిపుర్​ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27న తొలి దశ, మార్చి 3న రెండో దశ ఓటింగ్ జరుగుతుందని తొలుత ప్రకటించిన ఈసీ.. ఇప్పుడు ఆ తేదీల్లో ఈ మేరకు మార్పులు చేసింది. ఎన్నికల ఫలితం మాత్రం మార్చి 10నే వెలువడుతుందని స్పష్టం చేసింది.