ఆహారం విషయంలో చైనా మరో కీలక నిర్ణయం – రెస్టారెంట్ కు వెళితే ?

ఆహారం విషయంలో చైనా మరో కీలక నిర్ణయం - రెస్టారెంట్ కు వెళితే ?

0
64

ప్రపంచంలో 2013 నుంచి ఓ పెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద ఫంక్షన్ల నుంచి చిన్న చిన్న ఫంక్షన్ల వరకూ ఎక్కడ అయినా సరే ఫుడ్ తింటే కచ్చితంగా వేస్ట్ చేయద్దు అని. మిగిలింది కూడా అన్నం లేక బాధపడేవారికి ఇవ్వాలి అని పెద్ద క్యాంపెయిన్ నడిచింది.

అయితే తాజాగా ఇప్పుడు చైనా ఆహారాన్ని వృధా చేయకుండా ఉండేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. దేశాధ్యక్షుడు జీ జింగ్పింగ్ పిలుపునిచ్చారు ఫుడ్ వేస్ట్ చేయకండి అని. ఈ కోవిడ్ సమయంలో అస్సలు ఆహరం వేస్ట్ చేయద్దు అని అన్నారు.

ఆహార భద్రత సంక్షోభం రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చైనాలో భారీ వర్షాలు నదులు పొంగుతున్నాయి, వరదలు బీభత్సం సృష్టించాయి, ఈ సమయంలో పంటలు నాశనం అయ్యాయి, అలాగే ఆహర ధాన్యాల నిల్వలే వృదా అయ్యాయి…రెస్టారెంట్లకు వచ్చిన వారికి ఒక డిష్ను తక్కువగా సర్వ్ చేయాలని నిర్ణయించాయి. రెస్టారెంట్ కు పది మంది వెళితే వారు 9 ప్లేట్స్ ఆర్డర్ ఇవ్వాలి అని తెలిపారు అక్కడ కేటరింగ్ సంస్ధల ప్రతినిధులు.