వారికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

0
46

ఏపీ  సర్కార్ సాక్షర భారత్ మిషన్ కోఆర్డినేటర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారు.

ఇక తాజాగా 2018 లో టీడీపీ ప్రభుత్వం తొలగించిన 502 మంది ఉద్యోగులను పునర్నియమించేందుకు అంగీకారం తెలిపారు సీఎం జగన్. సాక్షర భారత్ మిషన్ కింద మండలానికి ఒక కోఆర్డినేటర్ ఏర్పాటు చేయడం జరిగింది.

సీఎం జగన్ ఎన్నికల సమయంలోను ఇచ్చిన హామీ మేరకు 502 మందిని స్వచ్ఛ భారత్ కార్య క్రమంలో ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి ఒకే చెప్పారు. ఈ విషయంపై ఛైర్మన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వెంకట రామిరెడ్డి స్పందించారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.