ఎప్పటికైనా… చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడమే ఆయన లక్ష్యం అట

ఎప్పటికైనా... చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడమే ఆయన లక్ష్యం అట

0
34

ఏపీలో అంతర్వేది రథం దగ్దంపై రాజకీయాలు వేడెక్కాయి… ఇటీవలే ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రథం దగ్దం ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే అయినాకూడా రాజకీయాలు చల్లారకున్నాయి.. తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

జనసేన పార్టీ బీజేపీలు ఈ విషయంలో రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు… అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలోనే ఉందని అన్నారు… అక్కడ జనసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఉన్నాడని అన్నారు…ఆరెస్సెస్ ద్వారా కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు…

జనసేన పార్టీ కులాభిమానంతో బీజేపీ మతాభిమానంతో కుళ్లిపోయాయని హర్షకుమార్ ఆరోపించారు… అలాగే జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు జగన్ ఏపీలో ఒక్కో మతానికి ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు… అంతర్వేది రథం దగ్దంపై సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్న జగన్ శిరోమండనం కేసు కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు…

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కులాభిమానం ఎక్కువని అన్నారు… చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడమే ఆయన లక్ష్యం అని అన్నారు…చిరు ఫ్యామిలీకి ఆయన హనుమంతుడిలా ఉన్నారని హర్షకుమార్ అన్నారు..