పద్మ అవార్డులు వరించింది వీరినే..

0
34

2022 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషణ్​, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గానూ ఈ అవార్డులు అందిస్తోంది. పద్మ అవార్డులు పొందిన మొత్తం 128 మందిలో 34 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది.

హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్​ను మరణానంతరం పద్మవిభూషణ్​తో గౌరవించింది. కరోనా టీకాలు తయారు చేసిన సీరం, భారత్​ బయెటెక్ సంస్థల ఛైర్మన్లకు పద్మ భూషణ్​ అందించనుంది.

పద్మశ్రీ పొందిన వారిలో ప్రముఖులు

నీరజ్​ చోప్డా

ప్రమోద్ భగత్

వందన కటారియా

సింగర్​ సోనూ నిగమ్​

పద్మ భూషణ్​ పొందిన వారిలో ప్రముఖులు..

శ్రీ గులాం నబీ ఆజాద్​(జమ్ముకశ్మీర్‌)

భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్‌

సీరం ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా

బుద్ధదేవ్‌ భట్టాచార్య

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌

పద్మ విభూషణ్​ పొందిన వారు

ప్రభ ఆత్రే, మహారాష్ట్ర

శ్రీ రాధేశ్యామ్​ ఖామ్కే(మరణానంతరం), ఉత్తర్​ప్రదేశ్​

జనరల్​ బిపిన్ రావత్​(మరణానంతరం), ఉత్తరాఖండ్​.

శ్రీ కల్యాణ్ సింగ్(మరణానంతరం), ఉత్తర్​ప్రదేశ్​