హుస్నాబాద్‌లో హైటెన్షన్..ఆగని గౌరవెల్లి భూనిర్వాసితుల ఆందోళన

0
34

తెలంగాణ: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గుడాటిపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళన ఇంకా కొనసాగుతోంది. గౌరవెళ్లి ప్రాజెక్టులో భాగంగా అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు వెళ్లటంతో వారిని అడ్డుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రాజెక్టులో 95 శాతం భూసేకరణ పూర్తయ్యిందని..అందిరికి దఫల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌ తెలిపారు. కొంతమందికి మాత్రమే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు భూనిర్వాసితుల ఆందోళనకు ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. హుస్నాబాద్ లో ఆందోళనకు కాంగ్రెస్‌ నేతలు సంఘీభావం తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మద్దతు పలికారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ తరహాలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు.