భారత్ లో కరోనా దూకుడు ఎలసాగిందంటే…

భారత్ లో కరోనా దూకుడు ఎలసాగిందంటే...

0
34

భారతదేశంలో కరోనా దూకుడు పెరుగుతోంది.. రోజురోజుకు ఈ మహమ్మారి తన కొరలను చాచుతోండటంతో ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరుగుతోంది… భారత్ లో మొదటి సారిగా ఫిబ్రవరి 15నున కేరళలోని మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఆ తర్వాత పెద్దగా కరోనా కేసులు నమోదు అవ్వలేదు..

ఇక మార్చి రెండు నాటికి దేశం మొత్తం మీద కేసుల సంఖ్య ఆరుకు చేరింది… ఆ తర్వాత రెండు రోజుల్లోనే మార్చి నాలుగు నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29కి చేరింది.. ఇక అక్కడ నుంచి క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరగసాగింది… మర్చి 10 నాటికి కేసుల సంఖ్య 62 గా నమోదు అయింది…

మర్చి 14కి 100కి చేరింది… 19కి 194 ఉండగా మార్చి 21 నాటికి ఏకంగా 332 కేసులు నమోదు అయ్యాయి.. 23 నాటికి 499 చేరింది… ఇక మార్చి 25 నాటినుంచి రోజు వారిగా పరిశీలిస్తే 25న 657, 26 నాటికి 727కు చేరింది.. 27నాటికి 887కు చేరింది.. మార్చి 28 నాటికి 989మంది బాధితులు ఉండగా 29నాటికి వెయ్యి దాటింది… ఇక 30న 1250మంది కరోనా బాధిలుల ఉండగా 31 నాటికి కరోనా బాధితులు సంఖ్య 1397కు చేరింది..