కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల భీమా: రేవంత్ రెడ్డి

0
41

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. బూత్  లెవల్లో డిజిటల్ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్  కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ గాంధీభవన్ లో మాట్లాడిన రేవంత్..సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే  2 లక్షల రూపాయల పరిహారం అందుతుందన్నారు. ప్రమాదంలో ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరే వారికి ఒక ధీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నామని తెలిపారు. చాలా పారదర్శకంగా కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నామని, దాదాపు 30లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకే బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.