ఇంటర్ పాసైన అమ్మాయిలకు స్కూటీలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం …

ఇంటర్ పాసైన అమ్మాయిలకు స్కూటీలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ...

0
33

ఇంటర్ పాసైతే స్కూటీలిస్తారట .. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కూడా ఇదే నిజం . అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది .అయితే ఆ స్కూటీ ని పొందాలంటే ఉండాల్సిన అర్హతలు కూడా చెప్తూ నివేదిక ఇచ్చింది .

ప్రజ్ఞాన్ భారతి పేరుతో వస్తున్న ఈ పథకం ప్రకారం ఇంటర్ బోర్డులో ఫస్ట్ డివిజన్ మార్కులతో పాసైన వాళ్లకి మాత్రమే ఇది వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి తెలియచేసారు . ఈ అర్హతలు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసారు .

అయితే అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం దాదాపు 22000 స్కూటీ లు పంచుతున్నట్లు తెలుస్తుంది .. oct 15 లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి హిమశర్మ తెలియచేసారు .