సీబీఐకి అనుమతి ఇచ్చిన ఎపి సిఎం జగన్..!!

సీబీఐకి అనుమతి ఇచ్చిన ఎపి సిఎం జగన్..!!

0
41

ఏపీలో సీబీఐకు అనుమతి ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐకు అనుమతి నిరాకరిస్తూ జీవో తీసుకువచ్చింది. కేంద్రం ఏకపక్షంగా కక్షసాధింపుగా రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు చేయిస్తోందని భావించి చంద్రబాబు ప్రభుత్వం సీబీఐకు రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతి లేకుండా జీవోను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తూ కొత్తగా జీవో నెంబర్ 81 తీసుకువచ్చింది. దీంతో సీబీఐ మళ్లీ రాష్ట్రంలో యదేచ్ఛగా తమ పనులు చేసుకును అవకాశం వచ్చింది.