ఏపీ ప్రజలకు ఆస్తి పన్నుపై జగన్ సర్కార్ బంపరాఫర్..

0
60

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపుపై రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. ఇంకా దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ మునుపెన్నడూ కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందే పన్ను చెల్లింపుపై రాయితీ ప్రకటించలేదు.