నేడే ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన డబ్బులు..

0
79

విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో..ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి జగనన్న వసతి దీవెన హామీ వస్తుందని ఆయన తెలిపారు.

జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడు జమ చేయనుంది. తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్న లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

10 లక్షల మంది తల్లుల ఖాతాలోకి 1,024 కోట్లు వేస్తున్నామని.. కోర్సును బట్టి 10 వేలు, 15, వేలు, 20 వేలు జగనన్న వసతి దీవెన కింద ఇస్తున్నామని ఆయన తెలిపారు. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చామని ఆయన స్పష్టం చేసారు.