జేసీ బ్రదర్స్ దారెటు..

జేసీ బ్రదర్స్ దారెటు..

0
32

ఏపీ రాజకీయాలకు పరిచయం లేని జేసీ బ్రదర్స్ గురించి మరో వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది… 35 సంవత్సరాల నుంచి తాడిపత్రి నియోజక వర్గం జెసి బ్రదర్స్ కు కంచుకోటగా నిలిచింది… అయితే 2019 ఎన్నికల ఓటమి తర్వాత నుంచి జెసి బ్రదర్స్ తాడిపత్రి సెంగ్మెంట్ లో పట్టు కోల్పోతున్నారని వార్తలు వస్తున్నాయి.. తండ్రి వారసత్వాన్ని తీసుకుని జెసి అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో పోటీ చేశారు… కానీ గెలవలేక పోయారు… ఇక ఆయన ఓటమి చెందిన తర్వాత నుంచిఆయన నియోజక వర్గంలో కనిపించిన దాఖలాలు లేవని అంటున్నారు… హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకుని సొంత వ్యాపారాల్లో నిమగ్నమయ్యార ని వార్తలు వస్తున్నాయి… ఇక పెద్దా రెడ్డి మాత్రం ప్రభుత్వ పథకాలతో ముందుకు సాగుతున్నారు… ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చేఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు నల్లేరుమీద నడకే అంటున్నారు… ఏది ఏమైనా ఇప్పుడు జెసి బ్రదర్స్ కు పట్టు నిలుపు కోవాలంటే శక్తికి మించిన పనే అంటున్నారు…