Home రాజకీయం జగన్ సర్కార్ పై జేసీ సంచలన కామెంట్స్

జగన్ సర్కార్ పై జేసీ సంచలన కామెంట్స్

జగన్ సర్కార్ పై జేసీ సంచలన కామెంట్స్

0
173

విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం ఏపీలో పంచాయితీ ఎన్నికల వ్యవహారం తీవ్ర స్థాయిలో రగడ నడుస్తున్న తరుణంలో జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు…

తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… పంచాయితీ ఎన్నికలు అడ్డుకోవడం వెనుక లోతైన వ్యూహం ఉందని అన్నారు… ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే ఎత్తుడగ వేశారని అందుకే ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందని అన్నారు… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నతం వరకు స్థానిక ఎన్నికలు జరిగేది కష్టమని అన్నారు…

జస్టిస్ కనకరాజ్ ను ఎన్నికల కమీషనర్ గా నియమించుకుని ఇంతకు ముందు ఏకగ్రీవంమైన స్థానాలు చెల్లుబాటు అవుతాని కనకరాజ్ తో ఆదేశాలు ఇప్పిస్తారని వెళ్లడించారు… ఒక వేళ ఎన్నికలు వస్తే విపక్షఅభ్యర్థులను పోలీసుల బలంతో బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తారని అన్నారు…