హత్య కేసులో కొల్లు రవీంధ్ర ప్రమేయం ఉంది..

హత్య కేసులో కొల్లు రవీంధ్ర ప్రమేయం ఉంది..

0
33

వైసీపీ నేత మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కరరావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని జిల్లా ఎస్పీ రవీంధ్రనాద్ బాబు స్పష్టం చేశారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాంచారయ్య భాస్కరావు మధ్య రాజకీయ గొడవలు చాలా కాలంగా ఉన్నాయని తెలిపారు…

2013లోనే భాస్కరావును హత్య చేసేందుకు కుట్ర జరిగిందని అన్నారు… అనుకోని కారణాలవల్ల అప్పుడు చేయలేకపోయారని అన్నారు… భాస్కర రావు ఉంటేతాను రాజకీయంగా ఎదగలేనని నాంచారయ్య భావించారని ఇదే విషయంపై కొల్లు రవీంధ్రతో మాట్లాడారిని అన్నారు..

వీరిద్దరు గంట సేపు మాట్లాడారని తెలిపారు…. ఆతర్వాత ఫోన్ లోకూడా మాట్లాడారని ఆ కాల్ డేటాను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు… అయితే తనపేరు బయటకు రాకుండా చూడలని కొల్లు రవీంధ్ర అతనికి చెప్పారని అన్నారు… ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని అన్నారు…