లోకేశ్ కు సలహాలు సూచనలు-వైసీపీ

లోకేశ్ కు సలహాలు సూచనలు-వైసీపీ

0
113

ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు….దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు… శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ కు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియ సామావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్నూల్ జ్యుడీషిల్ క్యాపిటల్ గా ప్రకటించినందుకు జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు… వీకేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ది జరుగుతుందని అన్నారు.,..

గతంలో చంద్రబాబు నాయుడు శివరామ కృష్ణ కమిటీని తుంగలో తొక్కి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు…. ప్రస్తుతం చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని లోకేశ్ ను కోరారు… సర్పంచ్ పదవికి కూడా అర్హత లేని పవన్ జగన్ విమర్శంచడం దారుణం అని అన్నారు…