మళ్లీ అదే తప్పు చేస్తున్న చైనా సోషల్ మీడియాలో విమర్శలు

మళ్లీ అదే తప్పు చేస్తున్న చైనా సోషల్ మీడియాలో విమర్శలు

0
32

కోవీడ్ 19 మహమ్మారి ప్రపంచంలో అత్యంత దారుణమైన స్దితికి చేరుకుంది… కొన్ని వందల కేసులు నమోదు అయ్యాయి. అయితే మనదేశంతో పాటు అమెరికా ఇటలీ కూడా ఇంత దారుణమైన ప్రమాదంలో ఉన్నాయి, అయితే ఈ వైరస్ రావడానికి కారణం వుహన్ లోని జంతువులు అమ్మేచోట అక్కడ మాంసం నుంచి ఈ వైరస్ వచ్చింది అని అందరూ అన్నారు.

చైనాలో కూడా ఇది గబ్బిలాల స్రావాల ద్వారా వచ్చింది అన్నారు… దీంతో అక్కడ వీటి నుంచి వైరస్ వ్యాప్తి జరిగింది అని భావించారు, ఈ సమయంలో రెండు నెలల పాటు చైనా అంతా జంతువులని తినలేదు కాని ఇప్పుడు వుహన్ లో పరిస్దితి మారింది

దీంతో మళ్లీ చైనాలో వీటిని తినేందుకు జనం ఎగపడుతున్నారు.. ఏకంగా పెద్ద పెద్ద క్యూ లైన్లలో జనం నించుంటున్నారట, ఓ పక్క అత్యంత దారుణంగా ప్రపంచం ఈ వైరస్ వల్ల బాధపడుతుంటే మళ్లీ చైనా ఇదే బుద్దితో అక్కడ జంతువులు తినడం ఏమిటి అని మిగిలిన దేశాల ప్రజలు అందరూ ప్రశ్నిస్తున్నారు.