ప్ర‌శాంత్ కిషోర్ కు గుడ్ న్యూస్ చెప్ప‌నున్న మ‌మ‌తా బెన‌ర్జీ

ప్ర‌శాంత్ కిషోర్ కు గుడ్ న్యూస్ చెప్ప‌నున్న మ‌మ‌తా బెన‌ర్జీ

0
48

భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ కు అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి, ఈ స‌మ‌యంలో అక్క‌డ మ‌మ‌త స‌ర్కారు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది.. అక్క‌డ బీజేపీ ఈసారి గెల‌వాలి అని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను తీసుకోనున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీ త‌రపున టిక్కెట్లు ఎవ‌రికి ఇవ్వాలో కూడా ఆయ‌న అక్క‌డ స‌ర్వే చేస్తున్నారు,బెంగాల్ లో పీకే టీం అన్నీ ప‌రిస్దితులు గ‌మ‌నిస్తోంది. ఇటీవలే జేడీయూను వీడిన ప్రశాంత్ కిశోర్, ప్రస్తుతం తృణమూల్ కు సేవలందిస్తున్నారు.

అయితే మ‌మ‌త స‌ర్కారు ప్ర‌శాంత్ కిషోర్ కు జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాలి అని నిర్ణ‌యం తీసుకుంది. సెక్ర‌టేరియేట్ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. అయితే మీ పార్టీకి సేవ‌లు చేస్తే ఆయ‌న‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలా జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త ఇస్తారు, ప్ర‌జ‌ల సొమ్ము ఎలా ఖ‌ర్చు చేస్తారు అని విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.