పేడ దొంగతనం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా నిజమే మరి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా జరుగుతున్న వాస్తవం..
పేడను దొంగతనం చేస్తూ దొరికిన ఐదుగురు మహిళల నుంచి పోలీసులు ఏకంగా 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ పేడ దొంగతనం ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా, అసలు ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.చత్తీస్గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఏమిటి అంటే కిలో ఆవు పేడ ఇస్తే దాదాపు రెండు రూపాయలు ఇస్తారు, దీంతో ఇలా పేడకు ఎంతో డిమాండ్ పెరిగింది. అయితే ఇలా పేడకు డిమాండ్ పెరగడంతో చాలా మంది దొంగతనం చేస్తున్నారు.ఇంట్లో పెద్దలు చాలా మంది ఈ పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా తాజాగా ఐదుగురు మహిళలు దొరికిపోయారు. మొత్తానికి అక్కడ దొంగతనం చేయద్దు అని ప్రచారం కూడా చేస్తున్నారు.
|
|
ఇక్కడ పేడ దొంగతనం చేస్తున్నారు – ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు – కిలో ఎంతంటే
-