బ్రేకింగ్: బల్కంపేట ఎల్లమ్మ బోనాలపై మంత్రి కీలక ప్రకటన

0
41

బల్కంపేట ఎల్లమ్మ బోనాలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతుందని, అదే రోజు నుంచి ఎల్లమ్మ బోనాలు కూడా ప్రారంభం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. అమ్మ వారికి  2.5 కిలోల బంగారం  చేసిన బోనం, బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం , 5 కోట్లతో మల్టి లెవెల్ పార్కింగ్ నూతన భవనం నిర్మిస్తామని ఈ సందర్బంగా ప్రకటన చేశారు.