మై డియర్ పప్పూ అండ్ తుప్పూ… విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మై డియర్ పప్పూ అండ్ తుప్పూ... విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
55

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి పేదలను అవహేళన చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు… విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు యదావిదిగా పాఠకులకోసం…

తల్లిదండ్రులకు ఇంగ్లిష్ రాదు కాబట్టి పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోలేరట. తెలుగును కాపాడాల్సిన బాధ్యత పేదలదేనట. కార్పోరేట్ స్కూళ్ల ప్రయోజనాల కోసమే ఈ ఏడుపంతా.

ప్రధానికి లేఖ రాస్తే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ జవాబిచ్చారు. ‘అదిరిందయ్యా చంద్రం’ అన్నారని చంకలు గుద్దుకుంటున్నాడు. ఈయనిచ్చిన సలహా ఏమిటంటే కరోనా లెక్కలపై డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలట. తన కొంప ముంచిన బోర్డును కేంద్రంలో కూడా అమలు చేయాలని చెప్పాడు. వాళ్లూ మునగాలని కోరుకుంటున్నాడు.

PMOకు మీరు రాసిన లేఖ అందింది. ప్రస్తావించిన అంశాలను పరిశీలించాల్సిందిగా నా సహచరులను కోరతానంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాసిన జవాబును ప్రదర్శించే దౌర్భాగ్యం ఏమిటీ బాబూ? ఎవరు రాసినా వాళ్లిలాగే ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేస్తారు. నాకు రిప్లై ఇచ్చారహో అని మొత్తుకున్నట్టుగా ఉంది.

మై డియర్ పప్పూ అండ్ తుప్పూ భౌతిక దూరం పాటించడం అంటే… భౌతికంగా (రాష్ట్రానికి) దూరం కావటం కాదు….