రాజకీయాలపై నెల్లూరు ఆనందయ్య సంచల నిర్ణయం-ఆ పార్టీలకు షాక్!

Nellore Anandayya screen for another sensation ..!

0
38

కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న నెల్లూరు ఆనందయ్య మరో సంచలనానికి సిద్ధమయ్యారు. బీసీల కోసం ఏకంగా పొలిటికల్ పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో రాజకీయ పార్టీ ఏర్పాటు పనుల్లో ఆనందయ్య బిజీ బిజీగా ఉన్నాడు. నెల్లూరు జిల్లాల్లో అఖిల భారత యాదవ సమాఖ్య సమీక్షలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో యాదవ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అందరితో చర్చించిన తర్వత బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే పార్టీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే రోజు పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో ఓ టీమ్ ఇదే పనిలో ఉన్నట్లుగా సమాచారం.

ఆనందయ్య పెట్టపెట్టబోయే పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆనందయ్య. అయితే తాను మాత్రం జాతీయ అధ్యక్షుడిగా కాకుండా కేవలం ఏపీలోని పార్టీకి సారథ్యం వహిస్తానంటున్నారు ఆనందయ్య.

తన రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై వివరించారు. తన లక్ష్యాలను చెప్పారు. దేశంలో బీసీల పరిస్థితి, పార్టీ ఆవశ్యకతపై తన వద్ద ఓ బ్లూ ప్రింట్ ఉందంటున్నారు ఆనందయ్య.