పవన్ కల్యాణ్ కు మరింత పెరుగుతున్న ఆదరణ ఇదే రీజన్

పవన్ కల్యాణ్ కు మరింత పెరుగుతున్న ఆదరణ ఇదే రీజన్

0
35

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదిరిపోయేలా కొన్ని పనులు చేస్తాడు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఆయన పిలుపునిస్తే జనసైనికులు లక్షలాది మంది వస్తారు.. తాజాగా భవన నిర్మాణ కార్మికులు కోసం ఇసుక లభ్యత లేని కారణంగా లాంగ్ మార్చ్ చేశారు పవ్ కల్యాణ్, దీనికి లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు.. అంతేాకాదు, తెలంగాణలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా ముందుకు వస్తారు పవన్ కల్యాణ్.

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వం కాస్త ఆలోచించాలి అని, వారి డిమాండ్లు కొన్ని అయినా పరిష్కరించి వారితో చర్చలు జరపాలి అని కోరారు.. గతంలో ఆయన ఈ కోరిక కోరిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఏపీలో ఇసుక కూడా ఇప్పుడు దొరుకుతోంది .. దీంతో జగన్ సర్కారుపై పవన్ వేసిన తొలి అడుగు విజయవంతమైంది అంటున్నారు అభిమానులు.

ఇక తెలంగాణలో కూడా ఆర్టీసీ కార్మికులకు పవన్ మద్దతు ఇచ్చారు. కార్మికులు సమ్మె విరమింపచేస్తున్నారని వారిని భేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకోవాలి అంటూ కేసీఆర్ ని కోరారు పవన్.. దీంతో అభిమానులు ఆనందలో ఉన్నారు. రెండు తెలుగు ప్రాంతాల్లో పవన్ మంచి పనులతో దూసుకుపోతున్నారని కితాబిస్తున్నారు.