కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు..ఎప్పటినుండంటే?

0
36

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ సమావేశంలోమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల రద్దుతో పాటు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది.

అంతేకాకుండా ఈ నెల 15 నుంచి అనగా రేపటి నుండి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. రేపటి నుంచి 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని ప్రకటన చేశారు. ఇప్పటికే ఉన్న 36 లక్షల మందితో పాటు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది. మెుత్తం కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు జారీ చేయనుంది.

తెలంగాన ఏర్పడినప్పుడు మన బడ్జెట్ 62 వేల కోట్లు..గతేడాది లక్ష 24 వేల కోట్లు అని…ఏడేళ్లలో మూడింతల వృద్ధి రేటు సాధించామని హరీష్ రావు తెలిపారు. మన రాష్ట్రా తలసరి ఆదాయం లక్ష 24 వేలు ఉంటే ఇప్పుడు 2 లక్షల 78 వెలతో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఆహార ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానములో  ఉండడం గర్వకారణమని చెప్పుకొచ్చారు.