రజనీకాంత్ కు చెక్ పెట్టేందకు రంగంలో పీకే..

రజనీకాంత్ కు చెక్ పెట్టేందకు రంగంలో పీకే..

0
33

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి… కరుణా నిధి, జయలలితల మరణం తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార అన్నాడీఎంకే ఇటు డీఏంకేలు ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నారు…

వారికితోడు కమల్ హాసన్ నీది మయ్యమ్ పార్టీతో ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు… ఇక సూపర్ స్టార్ రజనీ కూడా కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు… ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు కూడా రజనీ… అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ, కమల్ హాసన్ లు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

దీంతో అధికారం సాధించాలనే డీఏంకే ఆశలు అడియాసలు కానున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అందుకే స్టాలిన్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు… ఇక జాతీయ పార్టీల ప్రభావం ఇక్కడ చాలా తక్కువ రజనీ ప్రభావం ఎక్కువగా ఉందని తెలియడంతో స్టాలిన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు… ప్రశాంత్ కిషోర్ ద్వారా రజనీకి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు….