ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యభిచారి

Prashant Kishore is a political prostitute

0
31

కేసీఆర్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గించి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామా.. రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్ అంటూ టిఆర్ఎస్ ఆడుతున్న నాటకాలను ఎవరు నమ్మరు. దొంగనే దొంగ దొంగ అన్నట్టు టిఆర్ఎస్ చేస్తున్నారు. మూడో సారి కేసీఆర్ గెలవడం కేసీఆర్ కు అసాధ్య. కేసీఆర్ శీర్షాసనం వేసినా కూడా ఈసారి గెలవడు. కేసీఆర్ నాటకాలను ఎవరు ఆ
నమ్మే పరిస్థితి లేకపోవడంతో పొలిటికల్ యాక్టర్లను పట్టుకున్నాడు.. ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ లను పట్టుకొని రాజకీయం చేస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యభిచారి. ప్రజల రక్త మాంసాలను తిని దోచుకొని కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ కు 500 కోట్ల రూపాయలు ఇస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే తెలంగాణ మేధావులు, ప్రజలు చూస్తూ ఊరుకుంటారా..ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ ర్రాజ్ లు కాళేశ్వరం చూసారు. అక్కడ మునిగిన ప్రజలను చూడాల్సింది. రాజకీయ వ్యబిచారులను పక్కన పెట్టుకొని కేసీఆర్ ఒక నీచ రాజకీయాలకు ఒడిగాడుతున్నాడు.. ప్రకాష్ రాజ్ మంచి నాయకుడు ఆయన కేసీఆర్ తో కాదు.. నిరుద్యోగులతో కలిసి పని చేయాలి.

తెలంగాణలో దెబ్బతింటున్న ప్రజల పక్షాన పని చేయాలి. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను పాతర వేసిన కేసీఆర్ పక్కన నిలబడటానికి సిగ్గులేదా. కూట్ల రాయి తీయనోడు ఎట్ల రాయి తీస్తారా అన్నట్టు కర్ణాటకలో ఎంపీగా పోటీ చేసి 20 వేల తెచ్చుకోనోడు ఇక్కడ ప్రకాష్ రాజ్ రాజకీయం చేస్తారా..ఒక బీహార్ వాడు, ఒక కర్ణాటక వాడు రాజకీయం చేస్తే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడా..ఎన్ని కుప్పి గంతులు వేసినా కేసీఆర్ గెలవడం అసాధ్యం.. బీజేపీతో కుమ్మక్కు అయ్యేది కేసీఆర్, టిఆర్ఎస్ మాత్రమే అంటూ దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు.