పృథ్వీ ఆడియో టేపు కేసు కీలక మలుపు

పృథ్వీ ఆడియో టేపు కేసు కీలక మలుపు

0
39

తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆడియో టేప్ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనం రేపింది… దీంతో ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు… ఈ ఆడియో టేప్ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారులను నియమించింది..

అయితే కేసు ముందుకు సాగడంలేదు… ఇంతవరకు పృథ్వీపై లిఖిత పూర్వకంగా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకున్నారు… దీంతో విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు… ఈ కేసును ముందుకు తీసుకువెళ్లలేమని అంటున్నారు…

కాగా పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న ఆయనన ఓ మహిళతో నువ్వంటే ఇష్టమని తన గుండెల్లో ఉన్నావని… లవ్యూ అంటూ ఫోన్లో పార్ట్ టైమ్ ఉద్యోగినితో మాట్లాడారు… అంతేకాదు తాను ప్రస్తుతం మధ్యం మానేశానని తాగడమంటూ జరిగితే అది నీవద్దే కూర్చొని తాగుతానంటూ ఈ ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడారు..

అంతేకాదు గతంలో ఛానల్ కార్యాలయంలోనే వెనుక వచ్చి పట్టుకుందామని అనుకున్నానని ఎక్కడ భయపడి అరుస్తావోనని ఆగిపోయానని అన్నారు…