మళ్లీ సీఎం జగన్ కు లేఖ రాసిని ఎంపీ రఘురామ కృష్ణంరాజు…

మళ్లీ సీఎం జగన్ కు లేఖ రాసిని ఎంపీ రఘురామ కృష్ణంరాజు...

0
40

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి ఎంపీ రఘరామ కృష్ణంరాజు లేఖ రాశారు… రెండు రోజుల క్రితం రాసిని ఈ లేఖను తన కార్యాలయం నుంచి తాజాగా విడుదల చేశారు… త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్నట్లు కథనాలు వస్తున్నాయని తెలిపారు..

అయితే ఈ కథనాలమేరకు ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు… ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని అన్నారు… గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసిని జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు…

ఇప్పుడు సీఎం జగన్ ఒక జిల్లాపేరు అల్లూరి సీతారామరాజు పేడతామని అధికార ప్రకటన చేయాలని అన్నారు.. కొత్త జిల్లాకు పేరుపెడితే ప్రజలు సంతోషపడతారని ఎంపీ రఘురామ కృషం రాజు స్పష్టం చేశారు…