రైలులో ఏసీ కోచ్ లలో కొత్త మార్పులు అన్నీ ఇలా చేయండి – ప్రయాణికులు

రైలులో ఏసీ కోచ్ లలో కొత్త మార్పులు అన్నీ ఇలా చేయండి - ప్రయాణికులు

0
38
Ashwini Vaishnaw

ఈ లాక్ డౌన్ వేళ దాదాపుగా రెండు నెలలుగా ప్రజా రవాణా లేదు, దీంతో పూర్తిగా అందరూ ఎక్కడ వారు అక్కడ చిక్కుకుపోయారు, ఈ సమయంలో రైల్వేశాఖ కొత్తగా రైళ్లు నడుపుతోంది.. కేవలం 200 ట్రైన్స్ మొదటవిడతగా నడుపుతోంది కేంద్రం, తాజాగా కొన్ని నిబంధనలు కూడా ప్రవేశ పెట్టింది రైల్వేశాఖ

మరీ ముఖ్యంగా 90 నిమిషాల ముందు ప్రయాణికులు స్టేషన్ కు చేరుకోవాలి, అలాగే దుప్పట్లు కూడా రైలులో కల్పించరు.. అయితే ఈ సమయంలో ఈశాన్య రైల్వే తాజాగా లక్నో జంక్షన్ నుంచి, ఏష్బాగ్ నుంచి వెళ్లే రైళ్ళలో కొన్ని మార్పులు చేసింది.

లక్నో జంక్షన్ స్టేషన్ నుండి వెళ్లే ప్రత్యేక రైలు పుష్పక్, లక్నో మెయిల్లలోని ఏసీ కోచ్లోకి వెళ్లే డోర్ కాలితో తొక్కడం ద్వారా తెరుచుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ డోర్ తీయనక్కర్లేదు చేతితో ముట్టుకోవక్కర్లేదు అన్ని బోగీల వాష్బేసిన్లలో సబ్బులను ఉంచారు. ఇలా అన్నీ రైళ్లల్లో చేస్తే బాగుంటుంది అంటున్నారు ప్రయాణికులు.