రాజ్య‌స‌భ రేసులో ఎవ‌రు ఉన్నా రెండు సీట్లు వీరికే

రాజ్య‌స‌భ రేసులో ఎవ‌రు ఉన్నా రెండు సీట్లు వీరికే

0
36

ఏపీలో తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ నాలుగు ప‌ద‌వుల ఆట.. అయితే ఆ నాలుగు ప‌ద‌వులుఏమిటి అంటే? వైసీపీ త‌ర‌పున నాలుగు రాజ్య‌స‌భ సీట్లు ఎవ‌రికి రానున్నాయి ఈ ప‌ద‌వుల పందేరంలో సీట్లు గెలుచుకుని పెద్ద‌ల స‌భకు వెళ్లే పెద్ద‌లు ఎవ‌రు అనేది చ‌ర్చ‌.

అయితే తెలుగుదేశం పార్టీకి బీజేపీ కాంగ్రెస్ జ‌న‌సేన ఇలా ఎవ‌రికి అవ‌కాశం లేదు.. అందుకే వైసీపీ త‌ర‌పున ఈనాలుగు సీట్లు జ‌గ‌న్ కే చెందుతాయి.. మ‌రి జ‌గ‌న్ ఎవ‌రికి ప‌దువులు ఇవ్వ‌నున్నారు అనే చ‌ర్చ జ‌రుగుతోంది..ముఖ్యంగా గ‌తంలో చంద్ర‌బాబు పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇచ్చేవారు.

మ‌రి ఇప్పుడు జ‌గన్ కూడా ఓ సీటు పారిశ్రామిక వేత్త‌కు ఇచ్చి మిగిలిన మూడు కూడా త‌న వెంట ఉన్న నేత‌ల‌కు ఇవ్వాలి అని చూస్తున్నారు ..అందులో మంత్రి ప‌దవులు కోల్పోయే సుభాష్ చంద్ర‌బోస్ లేదా మోపిదేవికి ఒక‌రికి అవ‌కాశం ఇవ్వున్నార‌ట‌. మొత్తానికి స‌రికొత్త నిర్ణ‌యం ఈ ప‌ద‌వుల ఎంపిక‌లో ఉంటుంది అంటున్నారు.