సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాములమ్మ

Ramulamma reacted strongly to the remarks of CM KCR

0
46

తెలంగాణ బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ మెంబర్ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ‘‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్..బండి సంజయ్ మెడలు విరుస్తారా? ఈ వింత ప్రచార మాటలు హుజురాబాద్‌కు వచ్చి ఎందుకు మాట్లాడలేదు. మీ అబద్ధాలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.’’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

హుజూరాబాద్ ఫలితాల ఎఫెక్టే.. నిన్నటి కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు కారణం అని పేర్కొన్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ డంబాచారం మాట్లాడుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్ చిన్న ఎన్నికైతే..రూ.500 కోట్ల స్వంత డబ్బు, వేల కోట్ల పథకాల డబ్బుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. కేసీఆరే కాదు..అవినీతి ఎవరు చేసినా జైలుకు పోవాల్సిందేనని అన్నారు.

‘‘ఒక్క రోజు కూడా సరిగ్గా ఉద్యమంలో పాల్గొనని.. చివరికి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సందర్భపు కొట్లాటలో కూడా లేని మీరు ఉద్యమకారుడని అని ఎలా చెప్పుకున్నారు కేసీఆర్?’’ అని విజయశాంతి ప్రశ్నించారు. ఢిల్లీలో ఉండి కూడా రైతులకు అండగా నిలవలేకపోయారు.. రైతులపై మీకున్న ప్రేమ ఏపాటిదో అప్పుడే అర్థమైంది సీఎం ఢిల్లీ టూర్‌ని ఉద్దేశించి విజయశాంతి వ్యాఖ్యానించారు.