రేషన్ కార్డులు పించన్ కార్డులపై సీఎం జగన్ కీలక ప్రకటన

రేషన్ కార్డులు పించన్ కార్డులపై సీఎం జగన్ కీలక ప్రకటన

0
113

ఏపీలో పలు సంక్షేమ పథకాలు అమలులో సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు, పేదలు అందరికి వారికి అన్నీ పథకాలు అమలు అయ్యేలా చూస్తున్నారు, నెలకి ఓ కొత్త పథకం తీసుకువచ్చి వారికి అందిస్తున్నారు, ఇచ్చిన హామీల్లో నవరత్నాలను అన్నీంటిని అమలు చేశారు.

అయితే తాజాగా గ్రామ సచివాలయాల సర్వీసులతో ఇప్పటికే పేదలకు ప్రతీ ఇంటికి అన్నీ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి…దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రేషన్ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.ఇక ఎవరికి అయినా ఈ పథకం రాకపోతే వారు ఎందుకు అనర్హులు అనేది తెలియచేయాలి.