ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో రేవంత్ రెడ్డి?

Rewanth Reddy at the Mahadharna at Indira Park?

0
42

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(USPC) భేటీ అయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల్లో వచ్చిన 317 జివో రద్దుకై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మద్దతు కోరారు ఉపాధ్యాయ సంఘాలు. ఈ జివో వల్ల వేలాదిమంది ఉపాధ్య ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోవడం జరిగిందని రేవంత్ రెడ్డికి సంఘాలు వివరించారు.

ఈ జివో అమలులో జరిగిన తప్పిదాల వల్ల అనేక మంది గుండె పగిలి చనిపోయినా జిల్లా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఎన్నో పోరాటలు చేసినా, ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదని రేవంత్ రెడ్డికి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న జిల్లా కలెక్టరేట్ ల ముందు చేపట్టే ధర్నాకి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల తరలేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను సమాయత్తం చేయాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కోరారు.

ఫిభ్రవరి 5న ఇందిరాపార్క్ లో జరిగే ఉపాధ్యాయ సంఘాల మహాధర్నాలో స్వయంగా పాల్గొనాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ఉపాధ్యాయ సంఘాలు. సంఘాల వినతికి స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతు.. ఉద్యోగ ఉపాధ్యాయుల్లారా అధైర్యపడకండి. 317 జివో రద్దుకై ఉద్యోగ ఉపాధ్యాయలు చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తోడుటుందని అభయమిచ్చారు. 317జివో రాష్ట్రపతి ఉత్తర్వులకి భిన్నంగా ఉన్నందువల్ల ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించటమే కాకుండా ప్రధానమంత్రి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళి జివో రద్దుకై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు‌.

రాష్ట్రపతి ఉత్తర్వులకి భిన్నంగా తీసిన జివో నెంబర్ 317 మూలంగా ఉద్యోగ ఉపాధ్యాయుల స్థానికతకు విఘాతం కలుగుతుందని ఆ జివోని ప్రధాని జోక్యం చేసుకుని రద్దు చేసే విధంగా ఫిబ్రవరి 5న హైదరాబాద్ విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం, ఎంపిల బృందం ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతామని తెలిపారు. అదేవిదంగా 13న హైదరాబాద్ విచ్చేస్తున్న రాష్ట్రపతిని ఈ అంశం పై అపాయింట్ మెంట్ కోరతామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల భేటీలో రేవంత్ రెడ్డితో టిపిసిసి ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టి.పి.ఆర్.టి వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, USPC& జాక్టో నాయకులు పోచయ్య, రవిశంకర్ రెడ్డి, మైకా శ్రీనివాస్, మహ్మద్ షౌకతలీ, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, దేవరకొండ సైదులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.