ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట- వ్యాపారులకు షాక్

RTC shocks travelers - shoppers

0
62

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్‌ క్యాంపును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దానం చేశారు సజ్జనార్. అనంతరం ఆయన మాట్లాడుతూ..టీఎస్ ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీలో బ్లడ్ డోనెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందని..తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ వారికి బ్లడ్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 80 సార్లు బ్లడ్ డోనేట్ చేశారని..ఆయన చేత నర్సంపేటలో బ్లడ్ డోనేట్ కాంప్ ప్రారంభమైందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేయాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యం… సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని కొత్త వేరియంట్ పై బయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌లోని స్టాళ్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొరడా ఝుళిపించారు. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకున్నారు. షాప్ నెంబర్ 26ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా షాపుపై మూడు సార్లు కన్నా ఎక్కువ ఫిర్యాదులు వస్తే మూసివేయించాలని సజ్జనార్ అధికారులకు ఆదేశించారు.