చంద్రబాబు సరిగా డీల్ చేయలేదట… టీడీపీ నేతల

చంద్రబాబు సరిగా డీల్ చేయలేదట... టీడీపీ నేతల

0
79

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజులు కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే… నిన్నటితో రెండు రోజులు పూర్తి కాగా నేడు మూడవరోజు పూర్తి కానుంది… నిన్న చంద్రబాబు ప్రొద్దుటూరు కడప జమ్మలమడుగు పులివెందుల మైదుకూరు నియోజవర్గాల్లో కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు…

ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడును కార్యకర్తలు కడిగి పారేసినట్లు వార్తలు వస్తున్నాయి… జిల్లాలో పార్టీ ఈ స్థితికి రావడానికి కారణం మీరే అని నిలదీసినట్లు బోగొట్ట… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఆధినారాయణ రెడ్డికి సీఎం రమేష్ వంటి వారికి ఎక్కువ ప్రయార్టీ ఇచ్చి కార్యకర్తలను మిగిలిన నేతలను పట్టించుకోకపోవడం వల్ల టీడీపీకి ఈ దుస్థితి వచ్చిందని తమ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం…

జమ్మలమడుగులో కూడా కార్యకర్తలు చంద్రబాబును ప్రశ్నించారు…. ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఉన్నా పార్టీ సభ్యత్వం జరగలేదని ఎందుకు సభ్యత్వం జరుగలేదని ఎప్పుడైనా మీరు సమీక్షించారా అని కార్యకర్తలు చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది…