Flash- పంజాబ్ లో ప్రధాని మోడీకి షాక్!

0
43

ఫిరోజ్‌పుర్‌:-పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరగాల్సిన ప్రధాని మోదీ సభ అర్ధాంతరంగా రద్దయ్యింది. భద్రతా లోపల కారణంగా ప్రధాని పర్యటన రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.

పంజాబ్‌లోని అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా ప్రధాని మోదీని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ప్రధాని తిరిగి భటిండా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పంజాబ్‌ ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది.