రేవంత్ రెడ్డి అభిమానులకు షాక్..!

Shock to Rewanth Reddy fans ..!

0
34

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన అభిమానులకు షాక్ ఇచ్చారు. తన అభిమాన నాయకుడు పుట్టినరోజుకు ఆయనను కలుద్దామనుకున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న కారణంగా నా జన్మదినమైన సోమవారం అందుబాటులో ఉండలేకపోతున్నాను. నా అభిమానులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే..నా పుట్టినరోజు సందర్బంగా పేదలు, అనాథలకు మీకు తోచిన విధంగా సాయం చేయండి. మీరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పిన దానికంటే అదే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది.

– మీ రేవంత్ రెడ్డి

రైతులు అధైర్యపడవద్దని..కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ధాన్యం కుప్ప మీదే తనువు చాలించిన రైతు బీరయ్య కుటుంబానికి రేవంత్​ భరోసా ఇచ్చారు. బీరయ్య కుమారుడు రాజేందర్‌తో రేవంత్​రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.