పేదలకు షాక్..ఇక ఉచిత రేషన్​ బంద్!

Shock to the poor..from then free ration suspension ..

0
38

కొవిడ్​ కాలంలో నవంబర్​ 30 వరకు ప్రజలకు ఉచితంగా రేషన్​ అందించాలని గతంలో నిర్ణయించింది కేంద్రం. తాజాగా.. ఈ నెల 30 తర్వాత ఈ కార్యక్రమాన్ని పొడిగించేందుకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్​ పాండే వెల్లడించారు.

గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీబ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు తొలుత 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. 2020 ఏప్రిల్​లో ఈ కార్యక్రమం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్​లో ఈ ఏడాది మే, జూన్​ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా..జూన్​లో మరో ఐదు నెలలు పొడిగించారు. దేశవ్యాప్తంగా ఎన్​ఎఫ్​ఎస్​ఏ (జాతీయ ఆహార భద్రత చట్టం) కింద గుర్తింపు పొందిన రేషన్​ కార్డుహోల్డర్లకు ఉచిత రేషన్​ను అందిస్తోంది కేంద్రం. 80 కోట్ల మంది ఈ కార్యక్రమంతో లబ్ధి పొందినట్టు ప్రభుత్వం గతంలో వెల్లడించింది.

అలాగే ముడి పామ్​ ఆయిల్​, ముడి​ సోయాబీన్​ ఆయిల్​, ముడి​ సన్​ఫ్లవర్​ ఆయిల్​పై కనీస సుంకాన్ని 2.5శాతం నుంచి సున్నాకు తగ్గించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏడాదిగా పెరుగుతున్న వంట నూనె ధరలకు చెక్​ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.  క్రూడ్​ సోయాబీన్​ ఆయిల్​, క్రూడ్​ సన్​ఫ్లవర్​ ఆయిల్​పై 5శాతం అగ్రీసెస్​ను తగ్గించినట్టు పేర్కొంది.