ఉద్యోగులకు శుభవార్త..బదిలీలకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్

0
31

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్పర బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ప్రయోజనం క‌ల‌గ‌నుంద‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.